నటుడు సాయాజీ షిండే హెల్త్ అప్డేట్

ప్రముఖ నటుడు సాయాజీ షిండే హాస్పటల్ లో చేరారనే విషయం తెలిసి సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన ఆరోగ్యం ఫై అరా తీస్తున్నారు. అనారోగ్యం కారణంగా హాస్పటల్ లో చేరిన సాయాజీ షిండే కోలుకుంటున్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, ఆందోళన చెందాల్సిన పనిలేదంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులకు తెలిపారు. త్వరలోనే వచ్చి అభిమానులను అలరిస్తానని పేర్కొన్నారు. ఆయన పోస్టుపై స్పందిస్తున్న అభిమానులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

చాతీనొప్పి కారణంగా ఈ నెల 11న సాయాజీ షిండే మహారాష్ట్రలోని సతారాలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెలో కుడివైపున 99 శాతం బ్లాక్స్ గుర్తించి వెంటనే యాంజియోప్లాస్టీ చేశారు. సాయాజీ షిండే తెలుగు లో ఠాగూర్, అతడు, పోకిరి సహా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు.