కేంద్ర పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్లు వేసుకుంటున్నారుః సత్య కుమార్

ఏపీ అభివృద్ధికి ప్రధాని ఎంతో సహకరించారన్న సత్య కుమార్

bjp-satya-kumar

అమరావతిః ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో పయనిస్తోందని బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ అన్నారు. ఏపీ అభివృద్ధి కోసం ప్రధాని ఎంతో సహకరించారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పై ఎలాంటి వివక్ష చూపకుండా అనేక పథకాలకు అందించారని అన్నారు. కేంద్ర పథకాలకు వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం స్లిక్కర్లు వేసుకుంటున్నారని… దీన్ని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. సీఎం జగన్ అసమర్థతను, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ప్రస్తుతం ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నామని… పొత్తుల గురించి తర్వాత మాట్లాడతామని అన్నారు. ఎన్నికల ముందు మాయదారి మాటలు చెప్పిన జగన్… ఇప్పుడు ప్రజల మధ్యకు కూడా రాలేకపోతున్నారని చెప్పారు. వైఎస్‌ఆర్‌సిపి నేతలు పోలీసులు, వాలంటీర్లు లేకుండా బయటకు రాలేకపోతున్నారని అన్నారు.