వైస్సార్సీపీ నాయకులకు పరిటాల శ్రీరామ్ హెచ్చరిక

టీడీపీ అధినేత చంద్రబాబు ను అరెస్ట్ చేసిన తర్వాత ఏపీలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో బాబు ఫై ఆరోపణలు మోపుతూ జైలు కు పంపించారు. దాదాపు 50 రోజులు అవుతున్న ఇంతవరకు బెయిల్ కూడా రాలేదు. ఈ క్రమంలో బాబు కు రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి పెరుగుతుంది. ప్రజలంతా చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ..సంఘీభావం తెలుపుతున్నారు.

తాజాగా దీనిని ఉద్దేశించి వైస్సార్సీపీ నాయకులకు పరిటాల శ్రీరామ్ హెచ్చించారు. ‘వైస్సార్సీపీ నాయకులు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి. రాష్ట్రానికి ఎంతో మంచి చేసిన చంద్రబాబు నాయుడునే జైలుకు పంపించినప్పుడు భవిష్యత్‌లో మీ పరిస్థితి ఏంటన్నది ఊహించుకోవాలి. ముఖ్యంగా ధర్మవరంలో అరాచకాలు చేస్తున్న వారు.. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయో ఊహించి మసులుకోవాలి.’ అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

ధర్మవరం నియోజకవర్గంలో కొందరు వైస్సార్సీపీ నాయకులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని.. అదే విధంగా దాడులు చేయడం, చెట్లు నరకడం, బోర్లు పూడ్చడం వంటివి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు పరిటాల శ్రీరామ్. ‘మీ స్కూల్లో మీకు ఇలాంటి పాఠాలే చెప్పి ఉంటారు.. కానీ మా స్కూల్లో వేరే పాఠాలు చెప్పారు.. వాటిని బయటకు తీసేంత వరకు తెచ్చుకోవద్దు’ అని శ్రీరామ్ హెచ్చరించారు.