నటుడు సత్యరాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది.

బాహుబలి ఫేమ్ సత్యరాజ్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అయన తల్లి నతంబాల్ (94) కన్నుమూశారు. వయో వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కోయంబత్తూర్ లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ లో సినిమా షూటింగ్ లో ఉన్న సత్యరాజ్.. తల్లి మరణ వార్త తెలుసుకున్న కోయంబత్తూర్ కు బయలుదేరి వెళ్లారు.

నతంబాల్ కు ముగ్గురు పిల్లలు. ఒక అబ్బాయి.. ఇద్దరు అమ్మాయిలు. అబ్బాయి సత్యరాజ్.. కుమార్తెలు కల్పన, రూప. ఇక సత్యరాజ్ కు తల్లి అంటే ఎంతో ఇష్టం. ఆమెకు తాను నటించిన సినిమాలు చూడడం ఇష్టం అని ఆయన ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఇక సత్యరాజ్ తల్లి మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. బాహుబలి చిత్రంతో తెలుగు లో సత్యరాజ్ కు వీరాభిమానులు అయ్యారు. బాహుబలి , ప్రతి రోజు పండగే వంటి చిత్రాలు బాగా ఆకట్టుకున్నాయి.