చాల రోజల తర్వాత ఫ్యాన్స్ తో ముచ్చటించిన సమంత

నటి సమంత చాల రోజుల తర్వాత అభిమానులతో ముచ్చటించింది. గత కొద్దీ రోజులుగా సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధి కి సంబదించిన చికిత్స తీసుకుంటుంది. దీంతో సినిమాలకు దూరమైంది. ఒప్పుకున్నా సినిమా షూటింగ్ లు కూడా ఈమె లేకపోవడంతో ఆగిపోయాయి. అలాగే సోషల్ మీడియా కు సైతం దూరంగా ఉంటూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియా లో ఫ్యాన్స్ తో ముచ్చటించింది. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాదానాలు ఇచ్చింది.

ఇప్పుడు జీవితం ఎలా ఉంది? అని ఓ అభిమాని ప్రశ్నించగా, ఈ జీవితం మరోలా ఉందని సమంత సమాధానమిచ్చింది. మీలాంటి అభిమానులే తన బలం అని, మీ ప్రేమాభినాలు తన వెన్నంటి నడిపిస్తున్నాయని మరో అభిమానికి రిప్లై ఇచ్చింది. నేనెవరో తెలియని ఓ అమ్మాయి కోసం రోజూ ప్రార్థిస్తున్నాను… దీనిపై మీరేమంటారు? అని ఓ అభిమాని అడగ్గా… ఆ అమ్మాయికి నువ్వు అవసరం అని శామ్ బదులిచ్చింది. ఇక సమంత కొత్త చిత్రం శాకుంతలం సినిమా గురించి ఓ అభిమాని ప్రస్తావించాడు. 3డీలో రిలీజ్ చేసేంత ప్రత్యేకత శాకుంతలం చిత్రంలో ఉందా? అని ప్రశ్నించాడు. మీరే చూస్తారుగా అంటూ సమంత జవాబు ఇచ్చింది. సామ్ సమాధానాలతో అభిమానులు ఫుల్ హ్యాపీ అయ్యారు. త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.