అవతార్‌ 2 సినిమా చూస్తూ వ్యక్తి మృతి

అవతార్‌ 2 సినిమా చూస్తూ వ్యక్తి మృతి చెందిన ఘటన కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో చోటుచేసుకుంది. యావత్ సినీ లవర్స్ తో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న అవతార్ 2 మూవీ శుక్రవారం వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాను చూసిన ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. హాలీవుడ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ అద్భుత సృష్టి అవతార్‌ అంటూ..కామెరూన్‌ మరో లోకానికి తీసుకెళ్లారని గొప్పగా చెపుతున్నారు. చిన్న, పెద్ద అంత కూడా సినిమాను చూసేందుకు పరుగులు పెడుతున్నారు. ఈ క్రమంలో కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో విషాదం చేసుకుంది.

అవతార్ సినిమా చూస్తూ లక్ష్మీరెడ్డి శ్రీను అనే వ్యక్తి గుండెపోటుతో మరణించారు. లక్ష్మీ రెడ్డి అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి అవతార్‌-2 సినిమాకు వెళ్ళాడు. సినిమా మధ్యలో శ్రీనుకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా అక్కడే కూలిపోయాడు. శ్రీను తమ్ముడు రాజు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. ఇలాగే అవతార్‌-1కు కూడా జరిగింది. తైవాన్‌లో 42 ఏళ్ళున్న ఒక వ్యక్తి ‘అవతార్’ సినిమా చూస్తున్నప్పుడు గుండెపోటుతో మరణించాడు.