బండి సంజయ్ ఆరో విడత పాదయాత్రకు అధిష్టానం గ్రీన్‌సిగ్నల్

Bandi Sanjay’s sixth phase padayatra

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరో విడత పాదయాత్రకు అధిష్టానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఐదు విడతల్లో పాదయాత్ర చేపట్టి ప్రజల్లోకి వెళ్లిన సంజయ్..ఇప్పుడు ఆరో విడత యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అధిష్టానం ఆదేశాల కోసం ఎదురుచూసిన సంజయ్..ఇక ఇప్పుడు అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో త్వరలోనే యాత్ర చేపట్టాలని చూస్తున్నారు.

ఈ నెల 18 నుంచి యాత్ర మొదలుపెట్టాలని నేతలు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర నాయకత్వం రూట్‌ మ్యాప్‌ను రూపొందించే పనిలో నిమగ్నమైంది. కొడంగల్‌ నుంచి నిజామాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించేందుకు ప్రణాళిక సిద్దం చేస్తోంది. ఆరో విడత పాదయాత్రను 13అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది.