సమంత ఆరోగ్యంగానే ఉంది..టెన్షన్ వద్దు
సమంత అనారోగ్యంతో బాధపడుతుందనే వార్త..సోషల్ మీడియా లో వైరల్ కావడంతో అంత ఆమె ఆరోగ్యం గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. నిన్న కడపలో ఓ షాపింగ్ మాల్ ఒపెనింగ్ కు వెళ్లారు. అక్కడ దర్గా వద్ద ప్రత్యేక పూజలు చేవారు. అక్కడి నుంచి తిరిగి వచ్చిన సమంత అనారోగ్యానికి గురయ్యారని..జలుబు , దగ్గు తో బాధపడుతుండడం తో ఆమె హైదరాబాద్ లోని ఓ ప్రవైట్ హాస్పటల్ లో జాయిన్ అయ్యారనే వార్తలు సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి.
దీంతో ఆమెకు ఏమైనా కరోనా సోకిందా అని అభిమానులు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ వార్తలపై ఆమె వ్యక్తిగత సిబ్బంది స్పందించారు. సమంత పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని..సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దని సూచించారు. కొంచెం దగ్గు ఉండటంతో టెస్టు చేయించుకున్నారన్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉందని ..ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారని తెలిపారు. ఇక సినిమాల విషయానికి వస్తే తాజాగా ఈమె పుష్ప మూవీ ఐటెం సాంగ్ లో చిందులేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ దుమ్ములేపుతుంది. ఎక్కడ చూసిన ఈ సాంగే వినిపిస్తుంది.