కరోనా బారినపడిన కరీనా కపూర్..

కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృభిస్తుంది. గత రెండు నెలలుగా దేశ వ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పట్టడం..ప్రజలంతా వాక్సిన్ లు వేసుకుంటుండడం తో ఇక కరోనా మహమ్మారి పోయినట్లే అని అంత అనుకున్నారు. కానీ నవంబర్ చివరి వారం నుండి మళ్లీ కేసులు నమోదు కావడం ..రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండడం తో మళ్లీ ప్రజలు భయం పడుతున్నారు. ఇదే క్రమంలో ఓమిక్రాన్ అనే కొత్త రకం కరోనా వెలుగులోకి రావడం తో అన్ని దేశాలు అలర్ట్ అవుతున్నాయి.

తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ కి కరోనా సోకినట్టు తెలుస్తోంది. ఆమె స్నేహితురాలు అమృతా అరోరాకు కూడా కోవిడ్ 19 నిర్ధారణ అయినట్లు సమాచారం. వారిద్దరూ కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ అనేక పార్టీలకు హాజరయ్యారని, ఇద్దరు నటీమణులను ఇటీవల కాలంలో కలిసిన వ్యక్తులు RT-PCR పరీక్ష చేయించుకోవాలని బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించింది. సామాన్య ప్రజల సంగతి అటుంచితే… సెలెబ్రిటీలే ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. అభిమానులకు స్ఫూర్తిని ఇచ్చేలా ఉండాల్సిన ఇలాంటి కొందరు సెలెబ్రిటీలు వాళ్ళతోనే చెప్పించుకునే పరిస్థితి వస్తుందని అంటున్నారు.