ఆ బ్రాండ్ కు ప్రచారం చేయద్దంటూ బిగ్ బి కి TSRTC ఎండీ సజ్జనార్ రిక్వెస్ట్
క్రేజ్ ఉన్న సినీ స్టార్స్ చేత పలు సంస్థలు తమ ఉత్పత్తులను ప్రచారం చేయిస్తుంటారు. ఆ ప్రచారం చూసి చాలామంది వాటిని కొనుగోలు చేయడం..వాడడం చేస్తుంటారు. ఈ క్రమంలో బాలీవుడ్ లెజెండ్ యాక్టర్ బిగ్ బి అమితాబ్ బచ్చన్..ఆమ్ వే అనే సంస్థకు ప్రచార కర్తగా ఉన్నారు. దీన్ని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తప్పుబట్టారు. గొలుసుకట్టు సంస్థలకు ప్రముఖులు ఎవరూ ప్రచారం చేయొద్దంటూ ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు.
తాజాగా ఆమ్వే సంస్థకు ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రచారం చేయడంపై ఆయన్ను ట్యాగ్ చేస్తూ సజ్జనార్ ట్వీట్ చేశారు. ‘‘’గొలుసుకట్టు సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. అమాయక ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదిస్తున్నాయి. ఇలాంటి సంస్థలను సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం కానీ.. వాటికి మద్దతు ఇవ్వడం కానీ చేయొద్దు’’’ అని సజ్జనార్ సలహా ఇచ్చారు. మరి సజ్జనార్ రిక్వెస్ట్ ఫై బిగ్ బి ఏమైనా స్పందిస్తారా.. ? అనేది చూడాలి.