విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న బ్రో

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ మంగళవారం ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. బ్రో చిత్ర విజయోత్సవంలో భాగంగా అమ్మవారిని దర్శించుకుంది చిత్ర యూనిట్. హీరో సాయిధరమ్ తేజ్, దర్శకుడు సముద్రఘని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందుకుంది బ్రో చిత్రం బృందం. అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డు ప్రసాదాన్ని కూడా బ్రో చిత్రం బృందానికి అందించారు.

సముద్రఖని డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ , సాయి తేజ్ పాదాల పాత్రల్లో బ్రో మూవీ తెరకెక్కింది. జులై 28 న ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇదే క్రమంలో చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ ను నిర్వహిస్తూ..సినిమాను ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్తుంది.