సిఎం సహాయనిధికి రూ. 11,01,000 విరాళం అందజేత

Minister Talasani Srinivas Yadav- CM KCR

హైదరాబాద్‌: కరోనా పై పోరాటంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలకు పలువురు దాతలు, పారిశ్రామికవేత్తలు, ఎన్జీవోలు తమవంతు చేయూతను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఈరోజు నగరంలోని పలు సంస్థలు సిఎం సహాయనిధికి రూ.11,01,000ను విరాళంగా అందజేశాయి. ఈ క్రమంలో నగరంలోని ఫతేనగర్‌ స్టీల్‌ వ్యాపారుల అసోసియేషన్‌ రూ. 8,51,000, సంతన్‌బాగ్‌ రెసిడెన్షియల్‌ ఫ్లాట్స్‌ అసోసియేషన్‌ రూ.1,50,000, సికింద్రాబాద్‌కు చెందిన పుష్పా ట్రేడింగ్‌ కంపెనీ రూ. 1,00,000ను విరాళంగా సిఎంఆర్‌ఎఫ్‌కు అందించాయి. ఇందుకు సంబంధించిన చెక్కులను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్‌కు అందజేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/