ప్రజల డబ్బు దోచుకుని దీక్ష పేరుతో అమరవీరులను అవమానపరుస్తున్నారు: రోజా

roja-tribute-to-gandhiji

అమరావతి : మంత్రి రోజా మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. గాడ్సే కంటే ఘోరమైన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. గాంధి గారికి ఘోరమైన అవమానం పరిచేలా దీక్ష చేస్తున్నారు… దీన్ని మేము ఖండిస్తున్నామంటూ చురకలు అంటించారు. ప్రజలు చంద్రబాబును తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల డబ్బు దోచుకుని దీక్ష పేరుతో అమరవీరులను అవమానపరుస్తున్నారని ఫైర్ అయ్యారు.

నేను పుట్టి పెరిగిన తిరుపతిలో స్వాతంత్ర్య పోరాటం లో అమరవీరుల ట్రిబ్యూట్ వాల్ కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. స్వాతంత్ర్య అమరవీరులను ప్రతిరోజు గుర్తించుకోవాలని కోరారు. తిరుపతి, విజయవాడ, వైజాగ్ లు కూడా అమరవీరుల ట్రిబ్యూట్ వాల్ ఏర్పాటు చేస్తాం..అమరవీరుల ట్రిబ్యూట్ వాల్ ఒక గోడ కాదు ఒక గుడిలా భావించాలన్నారు. గాంధీ కోరుకున్న గ్రామాలలో స్వరాజ్యం వైస్సార్సీపీ తో సాధ్యం అయ్యిందంటూ మంత్రి రోజా గుర్తు చేశారు.