పవన్ ఫై మంత్రి రోజా సెటైర్లు..జనసేన పార్టీ ఎందుకు పెట్టారో ఆయనకే తెలియడం లేదు

వైస్సార్సీపీ మంత్రి రోజా మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై సెటైర్లు వేశారు. జనసేన పార్టీ పెట్టి 9 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఆయన ఆ పార్టీ ఎందుకు పెట్టారో ఆయనకే అర్ధం కావడం లేదని ఎద్దేవా చేసారు. తన నియోజకవర్గంలో నగరిలోని వడమాలపేటలో చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. ఇంటింటికీ తిరుగుతూ జగన్ పాలనపై, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు.

ఈ సందర్బంగా మంత్రి రోజా మాట్లాడుతూ..పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి తొమ్మిదేళ్లయిందని, ఇన్నేళ్లు గడిచినా.. ఎవరి కోసం పార్టీ పెట్టాడు, ఏం చేయడానికి పార్టీ పెట్టాడు అనే విషయంలో ఆయనకు క్లారిటీలేదని ఎద్దేవా చేసారు. ఆయన పార్టీపైన ప్రజలకు అస్సలు నమ్మకమేలేదని తెలిపారు. ఎప్పుడు ఎవరి జెండా మోయాలో.. ఎవరిని తిట్టాలో తెలియక జనసేన కార్యకర్తల్లో గందరగోళం నెలకొందని అన్నారు. చంద్రబాబుతో పాటు ఇలాంటి వాళ్లు ఏకమై సింగిల్ గా వచ్చే సింహం జగన్ ను ఏమీ చేయలేరని మంత్రి రోజా అన్నారు.