టీడీపీ ‘మోత మోగిద్దాం’ పిలుపు ఫై రోజా సెటైర్లు

టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును స్కిల్ కేసులో అరెస్ట్ చేసిన నేపథ్యంలో టీడీపీ పార్టీ ‘మోత మోగిద్దాం’ అంటూ వినూత్న కార్యాచరణకు పిలుపునిచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా ఐదు కోట్ల ఆంధ్రులు ఈ నెల 30వ తేదీ శనివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 వరకు ఐదు నిమిషాల పాటు ఉన్న చోటే మోత మోగించి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాశబ్దం వినిపిద్దామని పేర్కొన్నారు.

ఈ పిలుపు ఫై వైస్సార్సీపీ మంత్రి రోజా సెటైర్లు వేశారు. చంద్రబాబు అవినీతి చేసి జైలుకు వెళ్తే, అలాంటి అవినీతిపరుడికి ప్రజల మద్దతును కోరడం ఏమిటని ప్రశ్నించారు. మంగళగిరిలో నీ భర్త లోకేశ్‌ను ప్రజలు ఓడించారని.. అయినా కోర్టులు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు జైల్లో పెడితే మీ మామకు మద్దతుగా ఆందోళన చేస్తావా? అని నారా బ్రాహ్మణి ని ఉద్దేశించి రోజా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. రోజా ట్వీట్ ఫై అదే రేంజ్ లో టీడీపీ శ్రేణులు , నందమూరి అభిమానులు విమర్శలు చేస్తున్నారు.