భారత్‌లో 24 గంటల్లో 13,586 కొత్త కేసులు

కరోనా కేసుల సంఖ్య మొత్తం 3,80,532

Covid-19-Effect-
Covid-19

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో దేశంలో 13,586 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటి వరకు ఒక్క రోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. అదే సమయంలో 336 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,80,532కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 12,573 కి పెరిగింది. 1,63,248 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,04,711 మంది కోలుకున్నారు. ఈ మేరకు ఈరోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాలను వెల్లడించింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/