రేవంత్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన అక్బరుద్దీన్ ఓవైసీ

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేసారు. రేవంత్ రెడ్డి ఇటీవల ఓవైసీ కుటుంబాన్ని ఉద్దేశించి మీరు అంతా మహారాష్ట్ర నుండి తెలంగాణకు వలస వచ్చారు అని చేసిన వ్యాఖ్యలపై అక్బరుద్దీన్ ఫైర్ అయ్యారు.

రేవంత్ ను ఉద్దేశించి అక్బరుద్దీన్ మాట్లాడుతూ… పార్టీలు మారడమే అలవాటుగా పెట్టుకున్న రేవంత్ రెడ్డి మా గురించి కామెంట్ చేయడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. రేవంత్ రెడ్డి మరియు సోనియా గాంధీ లు ఎక్కడి నుండి వచ్చారో ఆలోచించుకుని మా గురించి మాట్లాడండి అంటూ రేవంత్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇక మీదట మా గురించి ఏమైనా కామెంట్ చేస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు.