భద్రాచలం ఆలయానికి ప్రభాస్ భారీ విరాళం

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..భద్రాచలం సీతారాముల ఆలయానికి భారీ విరాళం అందించారు. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా మూవీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో ఆదిపురుష్ మూవీ ఒకటి. తెలుగు-హిందీలో ఒకేసారి షూటింగ్ జరిపిన ఈ సినిమాను ఓం రౌత్ డైరెక్ట్ చేశాడు. ఇటీవల రిలీజైన ఈ సినిమా ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రాఘవుడిగా ప్రభాస్‌, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. సన్నీ సింగ్ లక్ష్మణుడిగా, దేవదత్త నాగే ఆంజనేయుడిగా యాక్ట్ చేశారు. ఇక జానకి పాత్రలో హీరోయిన్ కృతి సనస్ కనిపించింది. అతి త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ తరుణంలో భద్రాచలం సీతారాములవారికి ప్రభాస్ రూ.10 లక్షల విరాళం ఇచ్చాడు. ప్రభాస్ ప్రతినిధులు ఈ మేరకు చెక్‌ను ఆలయ ఈవోకు ఇచ్చారు. ఈ మేరకు శనివారం ఆలయ ఈవో రమాదేవికి చెక్కును ఇచ్చిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డబ్బును అన్నదానం, గోశాల విస్తరణ, ఆలయ అవసరాల నిమిత్తం కేటాయించినట్లు ఏఈవో భవాని రామకృష్ణారావు చెప్పారు. రామాయణం ఇతివృత్తంతో ప్రభాస్‌ శ్రీరాముడిగా నటించిన ఆదిపురుష్‌ చిత్రం హిట్ కావాలని ప్రధానాలయంలో మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు చేశారు.