పిల్లబిత్తిరీ లోకేష్ అంటూ మంత్రి రోజా కామెంట్స్

మంత్రి రోజా మరోసారి నారా లోకేష్ ఫై అలాగే చంద్రబాబు ఫై పలు విమర్శలు చేసారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలిచినా మీమే సైలెంట్ గా ఉన్నామని , ఒక్క స్థానం లో గెలిచినా టీడీపీ మాత్రం చాల ఎక్కువ చేస్తుందని రోజా అన్నారు. అంతే కాదు పిల్లబిత్తిరీ లోకేష్ అంటూ కాస్త ఘాటైన వ్యాఖ్యలే చేసింది. మంగళవారం మంత్రి రోజా సింహాంద్రి అప్పన్న దేవాలయాన్ని సందర్శించారు.

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. పిల్లబిత్తిరీ లోకేష్ ఎమ్మెల్సీ సీట్లు గెలిచామని మాట్లాడుతున్నాడు..చంద్రబాబు కలలో కూడా గెలుపును ఊహించలేదని తెలిపారు. పార్టీ కమ్మిట్ మెంట్ ఉన్నవాళ్లు, పార్టీ పై నమ్మకం ఉన్నవాళ్లు పార్టీ విధానాలకు కట్టుబడి ఉంటారన్నారు. ఈ రోజు వేరే పార్టీకి వెళ్లినవారందరూ జగన్ చరిష్మాతో గెలిచినవారేనని విమర్శలు చేశారు. కరోనా సమయంలో నీ ప్రాణాన్ని కాపాడారు అన్నప్పుడు, మా పార్టీకి ఎందుకు ఓటు వెయ్యలేదు..చంద్రబాబును నమ్మిన ఎన్టీఆర్ కే దిక్కులేదు.. ఆయనకు మిగతవారెంత? అని ఫైర్‌ అయ్యారు. ఎక్కువ ఎమ్మెల్సీ గెలిచిన మేము కామ్ గా ఉన్నాం…అతి తక్కువ వొచ్చిన వారికి బలుపు ఎక్కువయిందని విమర్శలు చేశారు