ఔటర్ రింగ్ రోడ్డు పై ఘోర ప్రమాదం..ఇద్దరు మృతి

ఔటర్ రింగ్ రోడ్డు పై ప్రమాదాలు తగ్గడం లేదు. ప్రతి రోజు ఏదొక ప్రమాదం చోటుచేసుకుంటూనే ఉంది. ఈరోజు మంగళవారం కూడా రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో కారులో ఐదుగురు యువకులు ప్రయణిస్తున్నారు.

కారు ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న నార్సింగ్‌ పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రలును సమీప ఆస్పత్రికి తరలించి, మత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.