నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్న సిఎం రేవంత్‌

cm Revanth Reddy

హైదరాబాద్‌: సిఎం రేవంత్‌రెడ్డి ఇవాళ (బుధవారం) ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ఎన్నికైన తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో తన సొంత నియోజకవర్గం కొడంగల్‌ అడుగుపెట్టబోతున్నారు. సీఎం బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి ప్రాంతానికి చేరుకోనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు 1500 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.