షోపియాన్‌ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూ కశ్మీర్: జమ్మూ కశ్మీర్ లోని షోపియాన్ అంశీపొరా ఏరియాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య మరో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. అక్క‌డ‌ ఇద్ద‌రు టెర్రరిస్టులు దాక్కొని ఉన్నారనే సమాచారం అందడంతో పోలీసులతో కలసి సెక్యూరిటీ ఫోర్సెస్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ సమయంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ఎదురు కాల్పులకు దిగాయి. ఈ ఘటనలో ఇద్దరు టెర్రరిస్టులు మృతి చెందారని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. వారి దగ్గర నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/