రెండు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు.. పాడెపై ఎక్కాడు

వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అప్పటి వరకు పెళ్లి పనుల్లో బిజీ గా ఉన్న వారంతా..ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. రెండు రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు.. పాడెపై ఎక్కాడు.

వివరాల్లోకి వెళ్తే..

నగరంలోని రామన్నపేటకు చెందిన దేవరకొండ సాగర్​చారి(28) రెండు రోజుల్లో పెళ్లి ఉండడం తో పెళ్లి పనుల్లో బిజీ బిజీ గా ఉన్నాడు. తన పెళ్లి పనుల నిమిత్తం బయటకు వెళ్లగా..బైక్ రూపంలో మృతువు కాటేసింది. నిర్మల మాల్ వద్ద బైక్​పై రోడ్డు క్రాస్​ చేస్తుండగా, వేగంగా వచ్చిన మరో బైక్​ అతడ్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన సాగర్​ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో రెండు రోజుల్లో పెళ్లితో కళకళలాడాల్సిన ఇంట్లో సాగర్​ మరణంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.