ఒడిశాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి
భువనేశ్వర్: ఒడిశాలోని భద్రక్ జిల్లా బారిక్పూర్ వద్ద ఈరోజు ఉదయం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. లారీ, టూరిస్ట్ బస్సు ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారందరిని భద్రక్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. టూరిస్టులంతా ఉత్తరప్రదేశ్ నుంచి పూరీకి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో బస్సులో 55 మంది యాత్రికులు ఉన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/