కమలా హారిస్, మార్క్ జుకర్‌బర్గ్‌లపై ర‌ష్యా నిషేధం

మాస్కో: ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌పై ర‌ష్యా నిషేధం విధించింది. ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లిన ర‌ష్యాపై అమెరికాతో పాటు యూరోప్ దేశాలు ఆంక్ష‌లు విధించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ర‌ష్యా కూడా ప్ర‌తీకార చ‌ర్య‌ల‌కు దిగుతోంది. దానిలో భాగంగా తాజాగా అమెరికాకు చెందిన 29 మంది రాజ‌కీయ‌వేత్త‌లు, కంపెనీ సీఈవోలను బ్లాక్ లిస్టులో పెట్టింది. ర‌ష్యా నిషేధిత జాబితాలో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌, ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హారిస్‌లు ఉన్నారు. నిర‌వ‌ధికంగా వారిపై బ్యాన్‌ను విధిస్తున్న‌ట్లు ర‌ష్యా తెలిపింది. ర‌ష్యా ప్ర‌క‌టించిన బ్లాక్‌లిస్టులో లింక్డిన్ సీఈవో ర్యాన్ రోస్లాన్స్కీ కూడా ఉన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/