మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..10 మందికి గాయాలు

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేగుంట హైవే బైపాస్ రోడ్డుపై యూటర్న్ చేసుకుంటున్న ఎమ్మెస్ అండ్ కంపెనీ కంపెనీ బస్సును ఓ ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. దీంతో ఎమ్మెస్ అండ్ కంపెనీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 10 మందికి పైగా కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 25 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది.

బుధవారం ఉదయం చందంపేట ఎమ్మెస్ అండ్ కంపెనీకి చెందిన బస్సు యూ టర్న్‌ చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన మరో ప్రైవేట్ బస్సు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ముందర ఉన్న ప్రైవేట్‌ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రవి శంకర్ రెడ్డి అనే ప్రయాణికుడికి తీవ్ర గాయాలు కాగా మరో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని హైదరాబాద్ కు తరలించారు. ఈ ప్రమాదం ఫై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.