కొండగట్టు అంజన్న ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొండగట్టు అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం కొండగట్టుకు చేరుకున్న కవితకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా బేతాళ స్వామి దేవాలయంలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించిన కవిత.. అనంతరం కొండగట్టు అంజన్నకు ప్రజలు పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా కవితను వేద పండితులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, డాక్టర్ సంజయ్ కుమార్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ ఉన్నారు.