బస్సులో మంటలు.. ఏడుగురు దుర్మరణం!

road-accident-in-karnataka

కలబురగి : కర్ణాటక కలబురగిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బీదర్​-శ్రీరంగపట్టణం హైవేపై కమలాపుర వద్ద శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో దుర్ఘటన చోటుచేసుకుంది. ఓ లారీని ఢీకొట్టి బస్సు బోల్తాపడగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు మరణించినట్లు సమాచారం. బస్సులో డ్రైవర్​తో పాటు మరో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. 12 మందిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. బస్సు గోవా నుంచి హైదరాబాద్​ వస్తున్నట్లు తెలుస్తోంది. మృతులంతా హైదరాబాద్​కు చెందినవారేనని సమాచారం. బస్సును గోవాలోని ఆరెంజ్​ కంపెనీకి చెందినదిగా గుర్తించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/