దేశంలో కొత్తగా 4,041 కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 4,041 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 10 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా మహమ్మారి నుంచి మరో 2,363 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 21,177 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 193.83 కోట్ల టీకా డోసులను పంపిణీ చేశారు. కరోనా నిర్ధారణ పరీక్షలు 85.17 కోట్లు దాటాయి.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/