కాంగ్రెస్ ఓ మహా సముద్రం అంటూ సీఎం రేవంత్ ట్వీట్

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ..శనివారం హైదరాబాద్ లోని తుక్కుగూడ లో ‘జనజాతర’ పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ కు ముఖ్య అతిధిగా రాహుల్ గాంధీ హాజరై, కాంగ్రెస్ మేనిఫెస్టో ను రిలీజ్ చేసారు. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుండి లక్షల్లో కాంగ్రెస్ శ్రేణులు హాజరై , సభ ను సక్సెస్ చేసారు. ఈ సభ వేదిక ఫై రాహుల్ గాంధీ బిజెపి ఫై నిప్పులు చెరుగుతూ..కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు అందించే హామీలను తెలియజేసారు.

ఈ సభ సక్సెస్ ఫై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ‘కాంగ్రెస్ ఓ మహా సముద్రం. అందులో మా కార్యకర్తలు నీటి బిందువులు కాదు.. పేదల బంధువులు. మా కార్యకర్తలు పోటెత్తిన కెరటాలు.. పోరాడే సైనికులు. మా కార్యకర్తలు జెండా మోసే బోయీలు మాత్రమే కాదు.. ఎజెండాలు నిర్ణయించే నాయకులు. నిన్నటి తుక్కుగూడ గడ్డపై పోటెత్తిన కాంగ్రెస్ మహా సముద్రపు కెరటాలు చెప్పిన నిజమిది.. చేసిన శబ్దమిది’ అని వీడియోను షేర్ చేశారు.