తెలంగాణను కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి చేసేందుకే గాంధీ కుటుంబం వచ్చింది – రేవంత్

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేటి నుండి బస్సు యాత్ర చేపట్టింది. ములుగు లో ఈ యాత్ర ను ప్రారంభించారు రాహుల్ గాంధీ. ఈ సందర్బంగా ములుగులో ఏర్పటు చేసిన భారీ బహిరంగ సభలో బిఆర్ఎస్ , బిజెపి ల ఫై నిప్పులు చెరిగారు.

ఈ సందర్బంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణను కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి చేసేందుకే గాంధీ కుటుంబం వచ్చిందన్నారు. తెలంగాణ ఇచ్చి 60 ఏళ్ల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేర్చిందన్నారు. అమరుల త్యాగాలతో సాకారమైన తెలంగాణను ఒక కుటుంబం చెరపట్టిందన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి, అరాచకం రాజ్యమేలుతోందన్నారు. తెలంగాణ ఇస్తామని కరీంనగర్ గడ్డపై సోనియా గాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇచ్చిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరటం లేదని సోనియా భావించారని ఆయన వెల్లడించారు.