తిరిగి టిఆర్‌ఎస్‌లోకి వెళ్తున్నారనే పుకార్లపై స్పందించిన ఈటల

ఇదంతా సిఎం కెసిఆర్ చేయిస్తున్న ప్రచారం అని విమర్శ

Etala Rajender
Etala Rajender

హైదరాబాద్‌ః బిజెపి నాయకుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరుతారని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ‘ఘర్ వాపసీ’ అంటూ ఈటల ఫొటోతో సోషల్ మీడియాలో పలువురు పోస్టులు పెడుతున్నారు. ఈ ప్రచారాన్ని ఈటల రాజేందర్ ఖండిచారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. బిజెపి నుంచి తాను తిరిగి టిఆర్ఎస్ చేరుతున్నానని, తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తున్నారన్న ప్రచారం అంతా పుకారే అని కొట్టి పారేశారు. ఇదంతా అదంతా పచ్చి అబద్ధం అన్నారు. ఇదంతా సిఎం కెసిఆర్ చేయిస్తున్న ప్రచారం అని విమర్శించారు.

టిఆర్ఎస్ లో తాను 20 ఏళ్లు పని చేశానని.. 28 మంది ఎమ్మెల్యేల్లో పది మంది బయటకు వెళ్లిపోయినా తాను పార్టీని వీడలేదని చెప్పారు. టిఆర్ఎస్ తీవ్ర సంక్షోభంలో ఉన్నప్పుడు కూడా తాను పార్టీ మారలేదని చేశారు. 2015 నుంచి ఆ పార్టీలో, ప్రభుత్వంలో తాను ఎన్నో రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొన్నానని ఈటల తెలిపారు. సిఎం కెసిఆర్ బయటకు నెట్టేస్తే తాను టిఆర్‌ఎస్ను వీడలేదని గుర్తు చేశారు. తన అంకితభావం ఎలాంటి అందరికంటే ముఖ్యమంత్రి కెసిఆర్ కే ఎక్కువ తెలుసు అని ఈటల పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని అభిప్రాయపడ్డారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/