ధరణిపై నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ధరణి ఫై సమీక్ష జరపనున్నారు. ఈ సమీక్షకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఉన్నతాధికారులు హాజరవుతున్నారు. ధరణి స్థానంలో కొత్తది తెస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు రేవంత్ రెడ్డి సమీక్ష ప్రాధాన్యత సంతరించుకుంది ధరణి లో పెద్దయెత్తున అవకతవకలు జరిగాయని రేవంత్ రెడ్డి సయితం ఎన్నికల వేళ ఆరోపించిన సంగతి తెలిసిందే. తమ అనుచరులకు భూములను కట్టబెట్టడం కోసం ధరణని తెచ్చారని కూడా విమర్శలు చేశారు. మరి ఈరోజు ఏల్నాటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

ఇక అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి కొత్త క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటుకు అధికారులు స్థలాలు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రికి క్యాంప్‌ ఆఫీస్‌ లేదు. ఆయన జూబ్లీహిల్స్‌లోని తన సొంత నివాసంలోనే ఉంటున్నారు. అక్కడ క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటు చేస్తే ట్రాఫిక్‌ ఇబ్బందులు ఏర్పడతాయన్న ఉద్దేశంతో అధికారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు.