కొడంగల్లో రేవంత్ ఓటమి ఖాయం – కేటీఆర్

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ , మంత్రి కేటీఆర్ గురువారం మక్తల్ రోడ్ షో లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ కు తెలివి లేదు.. 3ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు అనవసరంగా కరెంట్ ఇస్తున్నారని..రైతుల వద్ద 10HP మోటర్ ఉంటదా అని ప్రశ్నించారు.? కరెంట్ వస్తుందా, లేనే లేదు అని చెపుతున్నాడు..మక్తల్ గడ్డ నుంచి బంపర్ ఆఫర్ ఇస్తున్నా… కాంగ్రెస్ నేతల కోసం పెడతాం.. బస్సు ఎక్కి మక్తల్ లో ఎక్కడికైన వెళ్లి కరెంట్ తీగలను గట్టిగా పట్టుకొండి.. రాష్ట్రానికి ఓ దరిద్రం పోతుందని కేటీఆర్ విమర్శించారు.

కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఉంటే… కరెంట్ ఉండదు. కరెంట్ ఉంటే… కాంగ్రెస్ ఉండద అని అన్నారు. కొండగల్ లో రేవంత్ ఓటమి ఖాయమని కేటీఆర్ అన్నారు. 2014లో సిలిండర్ కు మొక్కండి.. ఓటు వేయండి అని మోడి అన్నారు. ఆనాడు రూ.400 సిలిండర్ ఇప్పుడు రూ.1200 అయ్యిందని కేటీఆర్ తెలిపారు. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తాం.. రేషన్ కార్డులు ఉన్నవారికి సన్న బియ్యం ఇస్తామని ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా.. అసైన్డ్ భూములు ఉన్నవాళ్లకు హక్కులు కల్పిస్తామన్నారు.