ప్రధాని మోడీ పై సుబ్రహ్మణ్యస్వామి కీలక వ్యాఖ్యలు

ఆర్థికశాస్త్రంలో మోడీ నిరక్షరాస్యుడు.. సుబ్రహ్మణ్యస్వామి

modi-is-illiterate-in-economics-says-subramanian-swamy

న్యూఢిల్లీః దేశంలో పెరుగుతున్న నిరుద్యోగిత, తగ్గుతున్న జీడీపీపై స్పందించిన బిజెపి సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. ఆర్థికశాస్త్రంలో మోడీ నిరక్షరాస్యుడు అంటూ ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేశారు. ‘‘దేశ జీడీపీ ఏటా 10 పది శాతం మేర పెరిగే అవకాశం ఉంది. దీంతో, కేవలం పదేళ్లలోనే నిరుద్యోగిత, పేదరికాన్ని నిర్మూలించవచ్చు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏం చేయాలో తెలియదు. ఇక ఆర్థికశాస్త్రంలో మోడీ నిరక్షరాస్యుడు..అందుకే ఇలా..’’ అని సంచలన కామెంట్స్ చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.