మైనారిటీలకు హామీ ఇచ్చిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయం ఫై కన్నేసిన గులాబీ బాస్..వరుస హామీలతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటీకే పలు హామీలు ప్రకటించిన కేసీఆర్..తాజాగా మైనారిటీలకు శుభవార్త తెలిపారు. బిఆర్ఎస్ అధికారంలోకి వస్తే ముస్లిం యువత కోసం ప్రత్యేక ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ(ఐటీ) పార్కును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

గురువారం మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన ర్యాలీలో కేసీఆర్ మాట్లాడారు. తమ ప్రభుత్వానికి ముస్లింలు, హిందువులు రెండు కళ్లుగా భావించి, అందరి అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. ముస్లింలకు పింఛన్లు, ముస్లిం విద్యార్థులకు రెసిడెన్షియల్ స్కూళ్లను తెరిచామని తెలిపారు. ముస్లిం యువత కోసం ప్రత్యేక ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని, ఇది హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్ సమీపంలో రానున్నట్లు వెల్లడించారు.