వివేక్‌ వెంకటస్వామితో రేవంత్ భేటీ..

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ తో పాటు కాంగ్రెస్ పార్టీలో వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ఎవరు ఎప్పుడు ఏ పార్టీ లోకి జంప్ అవుతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఉదయం వరకు బీజేపీ తో ఉన్న వ్యక్తి సాయంత్రం అయ్యేసరి కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇలా నేతలు తమకు అనుకూలంగా పార్టీలు మరి బాగానే ఉంటె..వారిని నమ్ముకున్న కార్యకర్తలే ఆగం అవుతున్నారు.

ఇదిలా ఉంటె టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శనివారం బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామితో భేటీ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌ పరిధిలోని వివేక్‌ వ్యవసాయ క్షేత్రానికి రేవంత్‌ గన్‌మెన్‌ కూడా లేకుండా ఒంటరిగా వచ్చారు. దాదాపు గంటన్నరపాటు ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా వివేక్‌ను కాంగ్రెస్‌ పార్టీలోకి రావాల్సిందిగా రేవంత్‌ ఆహ్వానించినట్లు సమాచారం. కాగా, వివేక్‌ కాంగ్రెస్‌లో చేరతారంటూ కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు ఈ భేటీతో బలం చేకూరినట్లయింది.