ఏపీలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందంటూ రేణుక చౌదరి కామెంట్స్

కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి..ఏపీలో జగన్ పాలన ఫై కీలక వ్యాఖ్యలు చేశారు. అధిష్ఠానం ఆదేశిస్తే ఏపీలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ తెలిపారు. బుధువారం విజయవాడలో పర్యటించిన రేణుక మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీలో తాను ఎక్కడైనా తిరుగుతానని… తనను ఎవరు ఆపుతారో చూస్తానని రేణుక అన్నారు. ఏపీలో పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని సీఎం జగన్ ను ఉద్దేశించి విమర్శించారు. ఏమైనా మాట్లాడితే కులాల పేరుతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఏపీలో వైస్సార్సీపీ నేతల తీరును ప్రజలు కూడా అసహ్యించుకుంటున్నారని , నాలుగేళ్లుగా ప్రజలు నరకం అనుభవిస్తున్నారని ఆమె అన్నారు. వైస్సార్సీపీ కి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. ఏపీకి రావాలని తనను ఇక్కడి ప్రజలు ఆహ్వానిస్తున్నారని… కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే తాను ఏపీ నుంచి పోటీ చేస్తానని తెలిపారు. పార్టీ పేరులో తెలంగాణ అనేదే లేకుండా చేసిన కేసీఆర్… ఆయన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతానని అంటున్నారని ఈ సందర్బంగా ఎద్దేవా చేశారు.