అనారోగ్య సమస్య తో బాధపడుతున్న రేణు దేశాయ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అనారోగ్య సమస్య తో బాధపడుతుందట. ఈ విషయాన్నీ స్వయంగా ఆమెనే సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. బద్రి సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రేణు..ఆ సినిమాతోనే పవన్ తో ప్రేమలో పడింది. కొంతకాలం సహజీవనం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకోవడం , కొంతకాలానికి విడాకులు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం పూణే లో తన ఇద్దరి పిల్లలతో ఉంటుంది.

ఇక సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే ఈమె ..నిత్యం తన పిల్లలకు సంబంధించిన అప్డేట్స్ తో అభిమానులను ఆనంద పరుస్తుంటుంది. అయితే ఆమె ఈసారి ఊహించని విధంగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లుగా ఒక పోస్ట్ వేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

నేను గత కొన్ని సంవత్సరాలుగా గుండె మరియు కొన్ని అనారోగ్య సమస్యలతో కొనసాగుతున్నాను అంటూ ఆ విషయం గురించి నాకు దగ్గరగా ఉండే నా ప్రియమైన వారందరికీ కూడా తెలుసు అని అన్నారు. కొన్నిసార్లు వాటిని అర్థం చేసుకొని శక్తిని పెంపొందించుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అని చాలా ఎమోషనల్ గా తెలిపింది. అయితే ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు తెలియజేస్తున్నాను అంటే.. నాకంటే చాలామంది ఇతర ఎన్నో సమస్యలతో పోరాడుతున్నారు. వారందరికీ గుర్తు చేయడానికి ఈ విధంగా చెబుతున్నాను. మనం ఎలాగైనా బలంగా ఉండాలి మన మీద మనకు ఎంతో విశ్వాసం ఉంచుకోవాలి. ఎప్పుడూ కూడా జీవితంపై ఆశను కోల్పోవద్దు. మన కోసం ఏదో ఒక తీపి అంశాన్ని జీవితం మనకు అందిస్తుంది అంటూ అందరూ నవ్వండి అంటూ తనలోని ధైర్యాన్ని తెలిపింది. అంతేకాకుండా రేణు దేశాయ్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపింది.

ఇక రేణు దేశాయ్ ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె ఇప్పటికే రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా ఇటీవల పూర్తయింది .