ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం: చంద్రబాబు

రోడ్ షో ఏర్పాటు చేసిన టిడిపి నేతలు

chandrababu

అమరావతిః సిఎం జగన్‌ పాలనను విమర్శిస్తూ టిడిపి ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరిట ఓ కార్యక్రమం రూపొందించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. రేపటి నుంచి మూడ్రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి టిడిపి అధినేత చంద్రబాబు హాజరవుతున్నారు. చంద్రబాబు పర్యటన జగ్గంపేట, పెద్దాపురం, అనపర్తి నియోజకవర్గాల్లో సాగనుంది. చంద్రబాబు పర్యటనలో టిడిపి నేతలు రోడ్ షో ఏర్పాటు చేశారు.