ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీరు

విజయవాడ: ప్రకాశం బ్యారేజీ నుంచి అధికారులు 20 గేట్ల ద్వారా సముద్రంలోకి నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ ఇన్‌ఫ్లో 8,340 క్యూసెక్కులుగా ఉంది. అలాగే ప్రస్తుత నీటిమట్టం 12 అడుగులకు చేరింది. పులిచింతల నుంచి 6వేలు, పరివాహక ప్రాంతం నుంచి 2 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రకాశం బ్యారేజీలోకి వచ్చి చేరుతోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/