ఇటలీ తీరంలో విషాద ఘటన… పడవ మునిగి 34 మంది మృతి

ఇటలీ తీరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. వంద మంది శ‌ర‌ణార్థుల‌తో వ‌స్తున్న ప‌డ‌వ మునిగి దాదాపు 34 మంది మృతి చెందారు. పడవలో మొత్తం 100 మందికి పైగా శరణార్థులు ఉన్నట్టు ఇటలీ కోస్ట్ గార్డ్ అధికారులు భావిస్తున్నారు. వారంతా ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ కు చెందినవారిగా గుర్తించారు. కోట్రోన్ ప్రావిన్స్ లోని కలాబ్రియా గ్రామం వద్ద తీరానికి మృతదేహాలు కొట్టుకొని వచ్చాయి.

అలల ఉద్ధృతికి సముద్రంలోని బండరాళ్లను బోటు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బోటు మధ్యకు విరిగిపోవడంతో శరణార్థులు నీటిలో మునిగిపోయారు. సొంతదేశంలో పొట్ట గడవక, కల్లోల భరిత పరిస్థితుల్లో జీవించలేక ఇతర దేశాలకు వలస వెళదామనుకునే శరణార్థులు అనేక సందర్భాల్లో సముద్ర ప్రమాదాలకు గురి అవుతూ వస్తున్నారు. ఇప్పుడు కూడా అలాగే జరిగింది.