రేపటి నుండి కొత్త షెడ్యూల్ మొదలుపెట్టబోతున్న మహేష్ – త్రివిక్రమ్

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ లకలయికలో SSMB28 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి కాగా రేపు సోమవారం నుండి కొత్త షెడ్యూల్ మొదలుకాబోతుంది. పూజా హగ్దే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా , సెకండ్ హీరోయిన్ గా ధమాకా బ్యూటీ శ్రీ లీల నటిస్తుంది. రేపు మొదలుకానున్న షెడ్యూల్ లో శ్రీ లీల పాల్గొననుంది. ఇటీవలే మహేశ్ బాబు ఫారెన్ ట్రిప్ కంప్లీట్ చేసుకుని రావడంతో ఈ చిత్రం తాజా షెడ్యూల్ కు రూపకల్పన చేశారు.

గతంలో మహేష్ – త్రివిక్రమ్ కలయికలో అతడు , ఖలేజా చిత్రాలు వచ్చి ప్రేక్షకులను అలరించగా..ఇప్పుడు హ్యాట్రిక్ మూవీ రాబోతుండడం తో అంచనాలు తారాస్థాయి లో ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని నాగ వంశీ నిర్మిస్తుండగా , థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దీంతో పాటు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ – సముద్ర ఖని కలయికలో తెరకెక్కుతున్న మూవీ కి స్క్రీన్ ప్లే , మాటలు అందిస్తున్నారు. రీసెంట్ గా ఈ మూవీ ప్రారంభం జరిగింది.