రంగమార్తాండ నుండి ‘దమిడి సేమంతి’ సాంగ్ రిలీజ్

కృష్ణ వంశీ డైరెక్షన్లో తెరకెక్కిన రంగమార్తాండ మూవీ ఈ నెల 22 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడ్ చేసారు. ఇప్పటికే పలువురి ఫస్ట్ లుక్ లు , సాంగ్స్ ఆకట్టుకోగా, గురువారం సినిమాలోని ‘దమిడి సేమంతి’ సాంగ్ ను రిలీజ్ చేసారు. ప్రకాశ్ రాజ్ .. రాహుల్ సిప్లి గంజ్ తదితరులపై ఈ పాటను చిత్రీకరించారు. ఒక పార్టీ సందర్భంలో ఈ పాట వస్తుందనే విషయం అర్థమవుతోంది.

సింధూరం , అంతఃపురం , మురారి , నిన్నే పెళ్లాడతా , ఖడ్గం , చందమామ వంటి బ్లాక్ బస్టర్ విజయాలను అందించి ఎన్నో అవార్డ్స్ దక్కించుకున్న డైరెక్టర్ కృష్ణవంశీ..ప్రస్తుతం ఓ హిట్ కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేకపోవడంతో ..ఈయనతో సినిమాలు చేసే నిర్మాతలు సైతం కరువయ్యారు. ప్రస్తుతం రంగమార్తాండ మూవీ పైనే ఈయన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ సినిమా మొదలుపెట్టి కూడా చాల కాలమే అవుతుంది. కానీ రిలీజ్ కు బ్రేకులు పడుతూ వస్తుంది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు రిలీజ్ కు సిద్ధమైంది.

ఈ మధ్యకాలంలో డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగిన మైత్రి మూవీ మేకర్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల రంగమార్తాండ హక్కులు దక్కించుకుందని తెలుస్తోంది. ప్రకాష్ రాజ్ , రమ్య కృష్ణ , బ్రహ్మానందం , అనసూయ , రాహుల్ సిప్లిగంజ్ , శివాత్మిక, ఆదర్శ బాలకృష్ణ వంటి వారు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాని హౌస్ ఫుల్ మూవీస్ రాజేష్ శ్యామల ఎంటర్టైన్మెంట్ సమీకంగా నిర్మించాయి. ఈ రంగమార్తాండ సినిమాకు మ్యూజికల్ మాస్ట్రో ఇళయరాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. మరి ఈ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

YouTube video