తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 11,224
ఇప్పటి దాకా 78 మంది మృతి
Chennai: తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 11,224కి చేరింది. రాష్ట్రంలో కరోనా కాటుకు ఇంత వరకూ 78 మంది ప్రాణాలు కోల్పోయారు.
చెన్నై నగరంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. నగరంలో ఇప్పటి వరకూ కరోనా సోకిన వారి సంఖ్య 6,750.
వైరస్ పెరుగుతుండటంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని తమిళనాడు ప్రభుత్వం భావిస్తోంది.
బీహార్లోనూ పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. వలస కార్మికుల్లోనే ఎక్కువ మందికి వైరస్ సోకినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
అక్కడ 560 మంది వలస కార్మికులకు వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,284గా నమోదయ్యింది.
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/