31లోగా జగన్కు సమన్లు అందించాలి: కోర్టు ఆదేశం
హుజూర్ నగర్లో కోడ్ ఉల్లంఘించారని జగన్పై కేసు
హైదరాబాద్ : సీఎం జగన్ పై నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుపై ఈరోజు నాంపల్లిలోని ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా జగన్ విచారణకు ఎందుకు హాజరు కాలేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. న్యాయమూర్తి ప్రశ్నకు సమాధానమిచ్చిన ఏపీ ప్రభుత్వ న్యాయవాది జగన్కు ఇంకా సమన్లే అందలేదని తెలిపారు. దీంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి ఈ నెల 31లోగా జగన్కు సమన్లు అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం విచారణను వాయిదా వేశారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/