మరోసారి ఇస్మార్ట్ కాంబో ..

డాషింగ్ డైరెక్టర్ పూరి – రామ్ కలయికలో మరో ఇస్మార్ట్ మూవీ రాబోతుంది. దీనికి సంబదించిన అధికారిక ప్రకటన ఈ నెల 15 న ప్రకటించినబోతున్నట్లు తెలుస్తుంది. దేవదాస్ మూవీ తో ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన రామ్..ఆ తర్వాత రెడీ , కందిరీగ , పండగ చేస్కో , నేను శైలజ , ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమ కోసమే, ఇస్మార్ట్ శంకర్ వంటి సూపర్ హిట్ మూవీస్ తో అలరించాడు.

పూరి డైరెక్షన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మాస్ ఆడియన్స్ కు రామ్ ను దగ్గర చేసింది. రామ్ కెరియర్ లోని ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతోనే డైరెక్టర్ పూరీ రీ ఎంట్రీ ఇచ్చి మల్లి ఫామ్ లోకి వచ్చాడు. కానీ ఆ తర్వాత విజయ్ దేవర కొండతో తీసిన లైగర్ చిత్రం బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ గా నిలిచింది. ఈ క్రమంలోనే ఆయన మరో కథతో రామ్ వద్దకు వచ్చాడు. వీరిద్దరి కాంబోలో మరో మూవీ తెరకెక్కబోతుంది. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను మే 15వ తేదీ అంటో సోమవారం రోజు ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో మళ్లీ సినిమా వస్తుందని తెలియడంతో అభిమానులు తెగ సంబర పడుతున్నారు.