పుష్ప యూనిట్ సభ్యుల్లో ఆనందం నింపిన సుకుమార్

అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో వచ్చిన పుష్ప 1 బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఆర్య , ఆర్య 2 తర్వాత సుక్కు – బన్నీ – దేవి శ్రీ ల కలయికలో వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతూ దూసుకెళ్తుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సక్సెస్ సంబరాలు జరుపుతూ అభిమానుల్లో ఉత్సహం నింపుతుంది. మంగళవారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పటు చేసారు. ఈ సందర్భంగా టీమ్ మెంబర్స్ కి రిటర్న్ గిఫ్ట్ లు ఇవ్వబోతున్నానని స్టేజ్ పైనే అనౌన్స్ చేశారు సుకుమార్. చిత్రానికి రేయింబవల్లు అనకుండా శ్రమించిన లైట్ బాయ్స్ సెట్ బాయ్స్ ఆర్ట్ డిపార్ట్మెంట్ సభ్యులకు ఈ సందర్భంగా వారి శ్రమని చూస్తే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని పించిందిని అందుకే ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున అందించాలని నిర్ణయించుకున్నానని సుకుమార్ తెలుపడం తో సభ్యులంతా సంతోషం వ్యక్తం చేసారు.

ఈ కార్య క్రమంలో బన్నీ కన్నీళ్లు పెట్టుకున్నారు. సుకుమార్ లేకుంటే నేను లేను.. సుకుమార్ పరిచయం కాకుంటే… అయనతో సినిమా చేయకుండా ఉంటే నా జీవితం ఇంకోలా ఉండేది అని అన్నారు అల్లు అర్జున్. నా జీవితం ఇంత సక్సెస్ ఫుల్ గా సాగుతుందంటే అది కేవలం సుకుమార్ వల్లే అన్నారు బన్నీ. నా జీవితంలో చాలా తక్కువమందికి మాత్రమే రుణపడి ఉన్న అని పదం వాడుతా. నా తల్లిదండ్రులు.. మా తాతగారికి.. నాకు అండగా నిలిచినా చిరంజీవిగారికి ఆతర్వాత సుకుమార్ కు అని అన్నారు.. నువ్వు లేక పోతే నేను లేను.. ఆర్య లేదు.. మరేమీ లేవు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు బన్నీ.. అలాగే బన్నీ మాటలకు సుకుమార్ కూడా కంట తడి పెట్టుకున్నాడు.

ఇక ఫిబ్రవరి నుండి పుష్ప 2 ను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి , దసరా బరిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని సుకుమార్ ప్లాన్.