ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిధిగా రజనీకాంత్
మే 28న సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను గ్రాండ్ జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు సినీ నటుడు , హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఈ క్రమంలో ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో విజయవాడలో నిర్వహించబోతున్న ఈ వేడుకలకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎన్టీఆర్, రజినీకాంత్ కలిసి టైగర్ సినిమాలోనూ నటించారు. మే 28న జరగబోతున్న ఈవెంట్లో రజినీకాంత్ తనకు ఎన్టీఆర్తో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తారనటంలో సందేహం లేదు. తలైవా వస్తుండంతో అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అగ్ర నాయకులు హాజరు కానున్నారు.