రజనీకాంత్ 170 వ చిత్రం ప్రకటన

సూపర్ స్టార్ రజనీకాంత్ తన వయసును సైతం లెక్క చేయకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఓ సినిమా సెట్స్ ఫై ఉండగానే మరో సినిమాను ప్రకటిస్తున్నారు. తాజాగా తన 170 వ చిత్రానికి సంబదించిన ప్రకటన వచ్చేసింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై అల్లిరాజా సుభాస్క‌రన్ నిర్మాత‌గా రజని 170 వ చిత్రం తెరకెక్కబోతుంది. ఈ చిత్రానికి టి.జె.జ్ఞాన‌వేల్‌ డైరెక్టర్. 2021లో జ్ఞాన‌వేల్‌ నుండి ‘జై భీమ్’ మూవీ వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేతి సుభాస్క‌రన్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా రజనీ 170వ సినిమా ప్రకటన చేసారు. ర‌జినీకాంత్‌తో త‌మ ప్ర‌యాణం కొనసాగుతుండ‌టంపై సంతోషాన్ని వ్య‌క్తం చేసిన నిర్మాణ సంస్థ త‌లైవ‌ర్ 170 చిత్రాన్ని వ‌చ్చ ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. రోబో సీక్వెల్ 2.0 త‌ర్వాత లాల్ స‌లామ్ చిత్రాల్లో రజినీకాంత్‌, లైకా క‌లిసి వ‌ర్క్ చేశారు. ఇప్పుడు త‌లైవ‌ర్ 170 వీరి కాంబోలో రానున్న మూడో చిత్రం. ఈ చిత్రానికి అనిరుద్ ర‌విచంద్ర‌న్ సంగీతాన్ని అందించ‌నున్నారు.